10+2 టెక్నికల్ ఎంట్రీతో అవకాశం
ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూపు విద్యార్థులు ఉచితంగా బీటెక్ చదువుకుని, లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగంలో చేరే అవకాశం వచ్చింది. ఇందుకు ఇండియన్ ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ దారి చూపుతుంది. జేఈఈ మెయిన్ స్కోరుతో దరఖాస్తులు షార్ట్ లిస్ట్ చేసి, రెండు దశల్లో వివిధ పరీక్షలు నిర్వహించి కోర్సులోకి తీసుకుంటారు.
ఇండియన్ ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ప్రకటన పూర్తి వివరాలు..
లెఫ్టినెంట్ఎంకొలువులకు సంబంధించిన ఉచిత శిక్షణఐదేళ్లు కొనసాగుతుంది. జనవరి, 2025 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి. విజయ వంతంగా శిక్షణ, కోర్సు పూర్తి చేసుకున్నవారికి బీటెక్ , డిగ్రీతోపాటు ఆర్మీలో లెఫ్టినెంట్ ఉద్యోగం సొంతమవుతుంది. విధుల్లో చేరినవారికి నెలకు లక్ష రూపాయల వేతనం లభిస్తుంది.
ఇండియన్ ఆర్మీ ఏడాదికి రెండుసార్లు 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీం ప్రకటన విడుదల చేస్తోంది. ప్రతిసారీ 90 మందికి అవకాశం కల్పి స్తుంది. జేఈఈ మెయిన్-2024 స్కోరుతో ఈ కోర్సు, ఉద్యోగానికి దర ఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తులు పరిశీ లించి, ఎక్కువ స్కోరుఉన్నవారికి అవకాశం కల్పిస్తారు.
ఇలా వడపోతలో “నిలిచినవారికి సర్వీస్ సెలక్షన్ బోర్డు (ఎస్ఎస్) ఆధ్వర్యంలో ఆగస్టు/ సెప్టెంబరులో బెంగళూరులో ఐదు రోజులు రెండు దశల్లో సైకలాజికల్ పరీక్షలు, గ్రూప్ పరీక్షలు, ఇంటర్వ్యూలు ఉంటాయి. తొలిరోజు స్టేజ్-1 స్క్రీనింగ్ (ఇంటెలిజెన్స్) పరీక్షల్లో అర్హత సాధించినవారిని స్టేజ్-2కి ఎంపిక చేస్తారు. ఆ తర్వాత నాలుగు రోజులు నిర్వహించే వివిధ పరీక్షల్లో అన్ని విభాగాల్లోనూ రాణించినవారిని కోర్సు, శిక్షణకు తీసుకుంటారు
ఖాళీలు : 90
అర్హత:
ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులతో ఇంటర్మీ |డియట్/ప్లస్ 2, జేఈఈ మెయిన్స్ 2024 స్కోరు తప్పనిసరి. పురుషులు మాత్రమే
కోర్సు, శిక్షణ..
కోర్సు, శిక్షణ ఐదేళ్లు కొనసాగుతుంది. ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ పాటు ప్రాథమిక మిలటరీ శిక్షణ అందిస్తారు. అనంతరం నాలుగేళ్లు టెక్నికల్ ట్రైనింగ్ పుణె, సికింద్రాబాద్, మావ్ లోని ఆర్మీ కేంద్రాల్లో ఎక్క డైనా కొనసాగుతుంది.
ఇందులో రెండు దశలు. .
ఫేజ్-1 మూడేళ్ల ప్రీ కమిషన్ ట్రైనింగ్,
ఫేజ్- 2 ఏడాది పోస్ట్ కమిషన్ ట్రైనింగ్ ఉంటాయి.
మూడేళ్ల ఫేజ్-1 శిక్షణ పూర్తిచేసుకుని, ఫేజ్- 2లో చేరినప్పుడు ప్రతి నెలా రూ.56,100 స్టైపెండ్ అందుతుంది. నాలుగేళ్ల శిక్షణ పూర్త యిన తర్వాత లెఫ్టినెంట్ హోదా దక్కుతుంది.
సుమారు ఏడాదిశిక్షణ, కోర్సు విజయవంతంగా పూర్తిచేసుకున్న వారికి ఇంజినీరింగ్ (బీటెక్) డిగ్రీని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, న్యూదిల్లీ అందిస్తుంది. వీరిని పూర్తిస్థాయిలో విధుల్లోకి తీసుకుంటారు. లెవెల్ -10 మూలవేతనం రూ.56,100, మిలటరీ సర్వీస్ పే రూ.15,500 ప్రతి నెలా అందుతాయి. డీఏ, హెచ్ఎర్ఎ, పలు ప్రోత్సాహకాలూ దక్కు తాయి.
మొదటి నెల నుంచే అన్నీ కలిపి దాదాపు లక్ష రూపాయలు అందుకోవచ్చు. తక్కువ వ్యవధిలోనే ఉన్నత స్థాయికి చేరుకో వచ్చు. రెండేళ్ల అనుభవంతో కెప్టెన్, ఆరేళ్ల సర్వీ స్లో మేజర్, పదమూడేళ్లకు లెఫ్టినెంట్ కల్నల్ హోదాలను వీరు పొందగలరు. ఈ విధానంలో ఎంపికైనవాళ్లు పదవీ విరమణ వయసు వరకు లేదా ఆసక్తి ఉన్నంత కాలం విధుల్లో కొనసాగ వచ్చు. ఇవి శాశ్వతం (పర్మనెంట్) ఉద్యోగాలు అందువల్ల వీరికి పూర్తి పింఛను అందుతుంది.
వయసు:
16 1/2 ఏళ్ల నుంచి 19 1/2 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే జులై 2, 2005 – జులై 1, 2008 మధ్య జన్మించిన వారే అర్హులు.
ఆన్లైన్ దరఖాస్తులు : జూన్ 13 వరకు స్వీకరిస్తారు.
వెబ్సైట్ : https://joinindianarmy.nic.in/index.htm
Last Date for Application | 13-06-2024 |
Official Website | Click Here |